
రైతులకు పంటనష్ట పరిహారం చెల్లించాలి
గోవిందరావుపేట: వడగండ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం తెలంగాణ రైతుసంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ఏప్రిల్, మే నెలలో కురిసిన భారీ వడగండ్ల వర్షాలకు మండల పరిధిలోని పంటపొలాలు 60శాతం వరకు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 2,993 ఎకరాలకు రూ.5.72లక్షలను మంజూరు చేసినా రైతుల అకౌంట్లలో జమ కాలేదని తెలిపారు. రైతుల అకౌంట్లలో వెంటనే మంజూరైన డబ్బులను జమ చేయాలన్నారు. యాసంగిలో పండించిన ధాన్యానికి బోనస్ డబ్బులు పడలేదని వివరించారు. ఈ కార్యక్రమంలో రామస్వామి, ఆదిరెడ్డి, మల్లారెడ్డి, మురళి, లెనిన్, సమ్మయ్య, పుల్లారెడ్డి, శ్రీనివాస్తో పాటు మరో 50 మంది రైతులు పాల్గొన్నారు.
తెలంగాణ రైతుసంఘం జిల్లా
కార్యదర్శి వెంకట్రెడ్డి