రాజీమార్గమే రాజమార్గం | - | Sakshi
Sakshi News home page

రాజీమార్గమే రాజమార్గం

Jun 15 2025 7:32 AM | Updated on Jun 15 2025 7:32 AM

రాజీమార్గమే రాజమార్గం

రాజీమార్గమే రాజమార్గం

ములుగు రూరల్‌: కక్షిదారులు తమ కోర్టు కేసులను రాజీ మార్గలో పరిష్కరించుకోవడం రాజమార్గమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీపీ సూర్యచంద్రకళ అన్నారు. ఈ మేరకు శనివారం జాతీయ లోక్‌అదాలత్‌ను జిల్లాకోర్టు ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌లో మూడు బెంచీలను ఏర్పాటు చేసి 875 కేసులను పరిష్కరించామని తెలిపారు. ఎంవీఓపీ కేసులు 01, కాంపిన్సేషన్‌ రూ.15 లక్షలు, కాంఫౌండబుల్‌ క్రిమినల్‌ కేసులు 228, సివిల్‌ కేసులు 02, సమ్మరీ ట్రయల్‌ కేసులు 639, రికవరీ అమౌంట్‌ రూ.6,95,800, ఫ్రీ లిటిగేషన్‌ బ్యాంకు కేసులు 21, బ్యాంక్‌ రికవరీ రూ.18,32,015 చెల్లించి కేసులు రాజీ కుదుర్చుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కన్నయ్యలాల్‌, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి జోత్స్న, డీఎస్పీ రవీందర్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వేణుగోపాలచారి, జనరల్‌ సెక్రటరీ భిక్షపతి, న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి

జస్టిస్‌ ఎస్‌వీపీ.సూర్యచంద్రకళ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement