
రేషన్షాపుల వద్ద పడిగాపులు
ములుగు రూరల్: రేషన్ షాపుల వద్ద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎండి.అమ్జద్పాషా అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మండల పరిధిలోని కాశిందేవిపేటలోని రేషన్ షాపును సందర్శించి లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో బియ్యం సరఫరాకు ఇబ్బందులు ఎదురుకాకుండా రేషన్కార్డుదారులకు ప్రభుత్వం మూడు నెలల బియ్యం ఒకేసారి అందిస్తుందని తెలిపారు. దీంతో రేషన్కార్డుదారులు మూడు నెలల బియ్యానికి మూడు సార్లు వేలిముద్రలు వేయాల్సి రావడంతో ఆలస్యం అవుతుందన్నారు. లబ్ధిదారుడు ఒకసారి వేలిముద్ర వేస్తే మూడు నెలల బియ్యం ఇచ్చేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాల రాజు, రమేష్, కొమురయ్య, నరేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.