ఎస్ఎస్తాడ్వాయి : జిల్లాలోని అన్ని మండలాల్లో జూలై 7న ఎమ్మార్పీఎస్ 31 ఆవిర్భావ దినోత్సవ వే డుకలను ఘనంగా జరుపుకోవాలని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు మడిపల్లి శ్యాంబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో మండల ఇన్చార్జ్ గోసంగి దుర్గారావు అధ్యక్షతన ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు శ్యాంబాబు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పుల్లూరు కరుణాకర్, ఎంఎస్పీ జిల్లా అ ధికార ప్రతినిధి గజ్జల ప్రసాద్ హాజరై మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఎ మ్మార్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల నూతన కమిటీలను ఎన్నుకోవాలన్నారు. జెండా గద్దెలను నిర్మాణం చేసుకోవాలన్నారు. మన ఉద్యమానికి స హకరించిన గ్రామాల్లోని అన్ని కులపెద్దలను, పార్టీ లకతీతంగా ఆహ్వానించి సన్మానం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గజ్జల ప్రశాంత్, నాయకులు మంతెన సారంగపాణి, వంకాయల సతీష్, మంతెన అన్వేష్, శివశంకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.