
ఏరువాక పౌర్ణమి.. వ్యవసాయ పనులు షురూ
ఏటూరునాగారం: జిల్లాలోని పలు మండలాల్లో ఏరువాక పౌర్ణమితో వ్యవసాయ పనులను రైతులు మొదలు పెట్టారు. రైతులు ఇంటి వద్ద విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేసుకొని ఆ తర్వాత పంట పొలాల్లోకి వెళ్లి దుక్కిటెద్దులకు ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలను కొట్టి వ్యవసాయ పనులను ప్రారంభించారు. బుధ, గురువారాల్లో ఏరువాక పౌర్ణమి రావడంతో రెండు రోజుల పాటు పూజలు చేసి వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. దీంతో గ్రామాల్లోని పంటపొలాల వద్ద రైతుల సందడి నెలకొంది.
రాంనగర్లో పంట పొలంలో ఎరువు, విత్తనాలను చల్లుతున్న రైతులు