
సహచరుడి కుటుంబానికి చేయూత
ములుగు రూరల్: పత్రికా రంగంలో సహచరుడు భూక్య సునీల్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ మేరకు పత్తిపల్లి పంచాయతీ కొడిశలకుంటలో గల బాధిత కుటుంబాన్ని ములుగు జర్నలిస్టులు గురువారం పరామర్శించి ఆర్థిక సాయంగా రూ.1.30లక్షలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సునీల్ కుటుంబానికి ఎల్లవేళల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గండ్రకోట సుధీర్యాదవ్, సీనియర్ జర్నలిస్టులు మహ్మద్ షఫీ, పిట్టల మధుసూదన్, సుంకరి సంపత్, బేతి సతీష్, గాదం దేవేందర్, రామిడి కృష్ణారెడ్డి. సుమన్, జాలిగం శ్రీనివాస్, చుంచు రమేష్, ఎనగందుల కొమురయ్య, రాజవర్ధన్, గండ్రకోట విష్ణు, వెంకన్న, సృజన్, బోయినపల్లి శ్రీధర్రావు, ఇందిర, శరత్, పింగిళి నాగరాజు, నగరపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక సాయంగా
రూ.1.30లక్షలు అందజేత