అంకితభావంతో పనిచేస్తేనే గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

అంకితభావంతో పనిచేస్తేనే గుర్తింపు

Jun 12 2025 3:27 AM | Updated on Jun 12 2025 3:27 AM

అంకిత

అంకితభావంతో పనిచేస్తేనే గుర్తింపు

ఏటూరునాగారం: పోలీసులకు విధి నిర్వహణలో తగిన గుర్తింపు లభిస్తుందని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ అన్నారు. డివిజన్‌ పరిధిలోని పోలీసులు, సిబ్బందికి బుధవారం ఆయన ఏఎస్పీ కార్యాలయంలో రివార్డులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేయాలన్నారు. ప్రజలు ఆపదలో ఉంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్న తక్షణ సేవలను అందజేయాలన్నారు. సమాజంలో పోలీసులంటే ప్రజలు గౌరవించే విధంగా సేవలు చేయాలన్నారు. ప్రతిభ కనబర్చిన సిబ్బందికి ప్రజలతోపాటు అధికారుల వద్ద కూడా గుర్తింపు లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ అనుముల శ్రీనివాస్‌, వెంకటాపురం సీఐ బండారి కుమార్‌, ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, ఎస్సైలకు తాజొద్దీన్‌, టీవీఆర్‌ సూరి, వెంకటేష్‌, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఏఎస్పీ శివం ఉపాధ్యాయం

ఉత్తమ సేవలు అందజేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి రివార్డులు

అంకితభావంతో పనిచేస్తేనే గుర్తింపు1
1/1

అంకితభావంతో పనిచేస్తేనే గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement