
సెకండ్ ఏఎన్ఎంలను రెన్యువల్ చేయాలి
ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో సెకండ్ ఏఎన్ఎలుగా పనిస్తున్న వారిని ఈ ఏడాది రెన్యువల్ చేయాలని బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు గండెపల్లి సత్యం, బీజేపీ మండల అధ్యక్షుడు వినుకోలు చక్రవర్తి అన్నారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో గల 54 ఆశ్రమ పాఠశాలలున్నాయని తెలిపారు. అందులో 54 మంది సెకండ్ ఏఎన్ఎంలుగా పనిచేస్తున్న వారిని తక్షణమే రెన్యూవల్ బీజేపీ నాయకులు బుధవారం ఐటీడీఏ డీడీ పోచంను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. అందుకోసం ఏఎన్ఎంలను వెంటనే రెన్యూవల్ చేసి వేతనాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్యం