నేడు జిల్లాలో మంత్రుల పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాలో మంత్రుల పర్యటన

Jun 11 2025 11:36 AM | Updated on Jun 11 2025 11:36 AM

నేడు

నేడు జిల్లాలో మంత్రుల పర్యటన

ములుగు రూరల్‌: జిల్లాలో నేడు(బుధవారం) రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రావు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కలు పర్యటించనున్నారు. హైదరాబాద్‌ నుంచి మంత్రులు హెలీకాప్టర్‌లో జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలకు ఉదయం 10.20 గంటలకు చేరుకుంటారు. 10.30 గంటలకు మండలంలోని ఇంచర్లలో ఇందిరమ్మ కాలనీకి చేరుకుని లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌ కాపీలను అందిస్తారు. అనంతరం గోవిందరావుపేట మండల పరిధిలోని చల్లాయిలో రెవెన్యూ సదస్సులో పాల్గొంటారు. మధ్యాహ్నం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో భోజన విరామం అనంతరం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌కు చేరుకుంటారు.

బడిబాటపై కళాప్రదర్శన

వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని లక్ష్మీదేవిపేటలో ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమంపై తెలంగాణ సాంస్కృతిక సారధి కోఆర్డినేటర్‌ రాగుల శంకర్‌ ఆధ్వర్యంలో కళాకారులు ఆటపాటలతో అవగాహన కల్పించారు. కార్పొరేట్‌ స్థాయి విద్యను ప్రభుత్వం సర్కారు బడులలో అందిస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడులకే పంపాలని పేర్కొంటూ పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో కళాబృందం సభ్యులు మార్త రవి, గోల్కొండ బుచ్చన్న, ఈర్ల సాగర్‌, రహీమోద్దిన్‌, రాజేందర్‌, సురేష్‌, విజయ్‌కుమార్‌, కిషన్‌, సామ్రాజ్యం, శోభ పాల్గొన్నారు.

మావోయిస్టుల బంద్‌ పాక్షికం

వెంకటాపురం(కె): మావోయిస్టులు చేపట్టిన భారత్‌ బంద్‌ మండలంలో పాక్షికంగా జరిగింది. ఉదయం 11గంటల వరకు షాపులు తెరుచుకోలేదు. కాగా మంగళవారం వారపు సంత కావటంతో మధ్యాహ్నం నుంచి షాపులు తెరుచుకున్నాయి. బస్సులు, ఆటోలు యధావిధిగా తిరిగాయి.

క్రికెట్‌ లీగ్‌ మ్యాచ్‌లో ములుగు జట్టు విజయం

ములుగు రూరల్‌: అండర్‌–19 క్రికెట్‌ లీగ్‌ మ్యాచ్‌లో ములుగు జట్టు విజయం సాధించిందని ఉమ్మడి వరంగల్‌ జిల్లా సెక్రటరీ చాగంటి శ్రీనివాస్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జాకారం పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో నిర్వహించిన క్రికెట్‌ మ్యాచ్‌లో జనగామ, ములుగు జట్లు తలపడగా ములుగు జట్టు విజయం సాధించిందని వివరించారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన జట్టు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాఽయి పోటీలకు ఎంపిక చేస్తామని వివరించారు. లీగ్‌ మ్యాచ్‌లలో క్రీడాకారులు తమ వ్యక్తిగత ప్రతిభను కనబర్చాలని సూచించారు.

‘అభివృద్ధిని విస్మరిస్తున్న అధికారులు’

ఏటూరునాగారం: ఏటూరునాగారంలోని ఐటీడీఏ కార్యాలయంలోని పథకాలు, అభివృద్ధిని ఐటీడీఏ పీఓ విస్మరించారని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్‌ అన్నారు. ఈ మేరకు మంగళవారం మహబూబాబాద్‌లో జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యులు జాటోతు హుస్సేన్‌కు బీజేపీ నాయకులు ఐటీడీఏ పీఓ, ఐటీడీఏ చైర్మన్‌, కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ద్వారా కోట్ల రూపాయల ఐటీడీఏకు నిధులు కేటాయిస్తే వాటిని గిరిజన సంక్షేమానికి ఖర్చు చేయకుండా దారి మళ్లించారని తెలిపారు. ఏజెన్సీలో 317 జీవో ద్వారా స్థానికేతరులు ఏజెన్సీ ప్రాంతాలలో చేరి స్థానికులకు రావాల్సిన ఉద్యోగ అవకాశాలు రాకుండా చేస్తున్నారని వివరించారు. అన్ని శాఖలలోని రిజర్వేషన్లను స్థానిక గిరిజనులకు అందుబాటులోకి తీసుకు రావాలని కోరారు. రాబోయే రోజుల్లో ఐటీడీఏను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు పల్లా బుచ్చయ్య, వనవాసీ కల్యాణ పరిషత్‌ జిల్లా సెక్రటరీ మైపతి సంతోష్‌, యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కల్లెపు ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు జిల్లాలో  మంత్రుల పర్యటన
1
1/2

నేడు జిల్లాలో మంత్రుల పర్యటన

నేడు జిల్లాలో  మంత్రుల పర్యటన
2
2/2

నేడు జిల్లాలో మంత్రుల పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement