జర్నలిస్టు శ్రీనివాసరావు అరెస్టు అప్రజాస్వామికం | - | Sakshi
Sakshi News home page

జర్నలిస్టు శ్రీనివాసరావు అరెస్టు అప్రజాస్వామికం

Jun 11 2025 11:36 AM | Updated on Jun 11 2025 11:36 AM

జర్నలిస్టు శ్రీనివాసరావు అరెస్టు అప్రజాస్వామికం

జర్నలిస్టు శ్రీనివాసరావు అరెస్టు అప్రజాస్వామికం

ములుగు రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌లోని సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు చేయడం.. సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్‌ చేయడం అప్రజాస్వామికమని పలువురు జర్నలిస్టులు ఏపీ ప్రభుత్వ తీరును ఖండించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు జర్నలిస్టుల హక్కులను, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులు వృత్తి ధర్మం పాటిస్తారని తెలిపారు. ప్రశ్నించే గొంతుకలపై ప్రభుత్వాలు కక్షసాధింపు చర్యలకు పాల్పడడం మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఎండి షఫీ అహ్మద్‌, పిట్టల మధుసూదన్‌, దూడబోయిన రాకేష్‌, సుంకరి సంపత్‌, రాంమూర్తి, గాదం దేవేందర్‌, జాలిగం శ్రీనివాస్‌, బోయినపల్లి శ్రీధర్‌రావు, గజ్జి రాజేష్‌, శరత్‌, కొమురయ్య, రాజువర్ధన్‌, రమేష్‌, మహేందర్‌, జలీల్‌ఖాన్‌, వెంకన్న, స్వామి, సంజీవ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement