
జర్నలిస్టు శ్రీనివాసరావు అరెస్టు అప్రజాస్వామికం
ములుగు రూరల్: ఆంధ్రప్రదేశ్లోని సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు చేయడం.. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని పలువురు జర్నలిస్టులు ఏపీ ప్రభుత్వ తీరును ఖండించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు జర్నలిస్టుల హక్కులను, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులు వృత్తి ధర్మం పాటిస్తారని తెలిపారు. ప్రశ్నించే గొంతుకలపై ప్రభుత్వాలు కక్షసాధింపు చర్యలకు పాల్పడడం మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఎండి షఫీ అహ్మద్, పిట్టల మధుసూదన్, దూడబోయిన రాకేష్, సుంకరి సంపత్, రాంమూర్తి, గాదం దేవేందర్, జాలిగం శ్రీనివాస్, బోయినపల్లి శ్రీధర్రావు, గజ్జి రాజేష్, శరత్, కొమురయ్య, రాజువర్ధన్, రమేష్, మహేందర్, జలీల్ఖాన్, వెంకన్న, స్వామి, సంజీవ పాల్గొన్నారు.