
రూ.70 లక్షలతో టెండర్లు
గోదావరి కరకట్ట నాలుగు చోట్ల గండిపడి ప్రమాదంగా మారింది. 2022–23లో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కరకట్ట కోతకు గురికాకుండా నిర్మించాలని ప్రభుత్వం, ఇంజనీరింగ్ అధికారులు సర్వేలు చేశారు. అయితే అస్సాంలోని బ్రహ్మపుత్ర నది వద్ద జియోట్యూబ్స్తో నూతనంగా సాంకేతిక పరిజ్ఞానం జోడించి జియోట్యూబ్స్ను అమర్చగా ఫలితాలు బాగున్నాయని తెలుసుకున్న ప్రభుత్వం ఆ పనులు ఏటూరునాగారం గోదావరి కరకట్ట వద్ద చేపట్టేందుకు 2023లో శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 70 లక్షలు నిధులు కేటాయించి టెండర్ల పిలిచింది. దీంతో అస్సాంకు చెందిన గుత్తేదారులు టెండర్లను దక్కించుకొని జియోట్యూబ్స్ అమర్చేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే రెండేళ్ల నుంచి జియోట్యూబ్స్ను అమర్చడానికి ఇంజనీరింగ్, గుత్తేదారులు జాప్యం చేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు నిర్మించలేదు.