
వాతావరణం
జిల్లాలో ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం వడగాలులు వీస్తాయి. సాయంత్రం ఉక్కపోతగా ఉంటుంది.
బాలింతల పాట్లు
● ప్రభుత్వ ఆస్పత్రిలో
సొంతంగా ఫ్యాన్లు ఏర్పాటు
● అసహనం వ్యక్తం చేసిన
బీఆర్ఎస్ నాయకులు
ములుగు రూరల్: జిల్లాకేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో గర్భిణులు, బాలింతలు ఫ్యాన్లు లేక నానా పాట్లు పడుతున్నారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేశ్రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం రోగులు ఇచ్చిన సమాచారం మేరకు ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇదే విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ జగదీశ్కు ఫోన్ చేస్తే నిర్లక్ష్యంగా నిధులు లేవని, ఎవరికై న చెప్పుకొండి అంటూ సమాధానం ఇస్తున్నారన్నారు. మంత్రి సీతక్క నియోజకవర్గంలో ఆస్పత్రి పరిస్థితి దయనీయంగా ఉందని, కలెక్టర్ స్పందించి రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుతోట చంద్రమౌళి, వాంకుడోత్ రాందాస్ పాల్గొన్నారు.
విద్యార్థులకు అభినందనలు
ఏటూరునాగారం : తెలంగాణ రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ గెలుపొందిన క్రీడాకారులకు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి తుల రవి, రాష్ట్ర హ్యాండ్బాల్ ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్ శుక్రవారం ములుగులో అభినందించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మంగళపల్లి క్రీడా మైదానంలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ బాలబాలికల హ్యాండ్ బాల్ పోటీల్లో ఉమ్మడి వరంగల్ బాలికల టీం గోల్డ్మెడల్, వరంగల్ బాలుర టీం సిల్వర్ మెడల్ గెలుపొందినట్లు కోచ్ పర్వతాల కుమార్ తెలిపారు. ములుగు జిల్లా హ్యాండ్ బాల్ క్రీడాకారులు జాడి రాధిక గోల్డ్ మెడల్, ఎండీ ఇమ్రాన్, జాడి వాసు సిల్వర్ మెడల్స్ సాధించినట్లు కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ శాఖ జూనియర్ అసిస్టెంట్ లావణ్య కుమారి, రెజ్లింగ్ కోచ్ సతీష్, సైక్లింగ్ కోచ్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.