
కేంద్ర పథకాలను ప్రజలకు వివరించాలి
ములుగు రూరల్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్రావు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా, మండల స్థాయి పదాధికారుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్రావు మాట్లాడుతూ వికసిత్ భారత్ సేవా, సుపరిపాలన, పేదల సంక్షేమం, దేశ భద్రతపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన పరిపాలనను ప్రపంచదేశాలు హర్షిస్తున్నాయని వివరించారు. దేశ ఆర్థిక, రక్షణ, విద్యా, వైద్యం, పారిశ్రామిక పురోగతి మేక్ ఇన్ ఇండియా వంటి కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, రవీంద్రాచారి, నరేష్, స్వరూప, రామరాజు, సునీల్, కృష్ణాకర్, యాదగిరి, వాసుదేవరెడ్డి, రవిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ములుగు మున్సిపల్ కమిషనర్ సంపత్ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాలతో సన్మానించి, మున్సిపల్ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు
మోహన్రావు