
మల్లంపల్లికి రాష్ట్ర ఉత్తమ పంచాయతీ అవార్డు
ఏటూరునాగారం: ములుగు జిల్లా పరిధిలోని మల్లంపల్లి గ్రామానికి ఉత్తమ పంచాయతీ అవార్డు వచ్చింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని టీపీసీబీలో పర్యావరణ, అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా గురువారం మల్లంపల్లి పంచాయతీ కార్యదర్శి పోలురాజు అవార్డు అందుకున్నారు. మల్లంపల్లిలో తడి, పొడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువు తయారీలో భాగంగా ఉత్తమ అవార్డు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ అవార్డు రావడానికి సహకరించిన మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకరలకు పంచాయతీ కార్యదర్శి రాజు కృతజ్ఞతలు తెలిపారు.