
దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
● ఆర్డీఓ వెంకటేశ్
వెంకటాపురం(ఎం): భూభారతి చట్టం అమలుకు మండలంలోని రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు కృషి చేయాలని ములుగు ఆర్డీఓ వెంకటేశ్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని వెల్తుర్లపల్లిలో ఆర్డీఓ వెంకటేశ్ శనివారం ఫీల్డ్ విజిట్ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. దరఖాస్తు చేసిన ప్రతీ రైతుకు చెందిన భూమిని పరిశీలించి రైతులకు న్యాయం జరిగేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.