‘గాలికుంటు’ నివారణే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

‘గాలికుంటు’ నివారణే లక్ష్యం

May 4 2025 7:09 AM | Updated on May 4 2025 7:09 AM

‘గాలికుంటు’ నివారణే లక్ష్యం

‘గాలికుంటు’ నివారణే లక్ష్యం

34

బృందాలు

వైద్యాధికారులు

పారా వెటర్నరీ

సిబ్బంది

గోపాల మిత్రలు

ములుగు రూరల్‌: గాలికుంటు వ్యాధి నివారణే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఉచిత టీకాలను పంపిణీ చేస్తున్నాయి. పశువుల సంరక్షణకు ప్రభుత్వాలు ఏడాదికి రెండుసార్లు వ్యాధి నిరోధక టీకాలను ఉచితంగా అందిస్తున్నాయి. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో రైతులకు గాలికుంటు వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. పశువులకు వచ్చే వ్యాధిపై రైతులు అప్రమత్తంగా ఉండాలని, వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా టీకాలు వేయించుకోవాలి. వ్యవసాయ అనుబంధ పాడి పరిశ్రమ రంగాల్లో గాలికుంటు వ్యాధి వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 15వ తేదీ వరకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పది మండలాల్లో ఉచిత టీకా స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా 34 బృందాలు ఏర్పాటు చేశారు. 1.08 లక్షల పశువులకు ఉచిత టీకాలు అందిచాల్సి ఉండగా ఇప్పటి వరకు 38,880 పశువులకు టీకాలు వేశారు.

వ్యాధి లక్షణాలు..

గాలికుంటు వ్యాధి సూక్ష్మక్రిములతో వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకి గేదెలు, ఆవులు ఆహారం సరిగా తీసుకోకపోవడంతో బక్కచిక్కి పోతాయి. పశువులకు రెండు నుంచి ఆరు రోజుల వరకు జ్వరం భారిన పడి నోరు, పెదాలు, నాలుక, కాళ్ల గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి అనతి కాలంలో వ్యాధి ముదిరిపోతుంది. పశువులు మేత, నీరు తీసుకోకపోవడంతో రోగ నిరోధక శక్తి తగ్గి పశువులు, దూడలు చనిపోయే ప్రమాదం ఉంటుంది.

వ్యాధి నివారణకు చికిత్స ఇలా..

వ్యాధి సోకిన పశువులకు ఆరోగ్య పరీక్షలు తప్పకుండా చేయించాలి. నోరు, పెదాలు, నాలుక, కాళ్ల గిట్టలను పొటాషియం పర్మాంగనేట్‌ లేదా సైలెన్‌ వాటర్‌తో శుభ్రం చేయాలి. రెండోసారి వ్యాధి సోకకుండా యాంటీబయాటిక్‌ మందులను, పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి బీ కాంప్లెక్స్‌ మందులను వాడాలి. గాలికుంటు వ్యాధిపై రైతులు నిర్లక్ష్యం వహించకూడదు. వైద్యుల సలహాల మేరకు క్రమం తప్పకుండా ఏడాదికి రెండు సార్లు టీకాలు వేయించుకోవాలి. గాలికుంటు వ్యాధి ప్రాణాంతకం కావడంతో అలసత్వం వహిస్తే రైతులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

వ్యాధి సోకిన పశువులకు..

గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువులతో ఉంచకుండా వేరుగా ఉంచాలి. ఎప్పటికప్పుడు పశువుల పాకను శుభ్రం చేయాలి. వారానికి ఒక సారి కొట్టంలో సున్నం చల్లి క్రిమీ కీటకాల నివారణ చర్యలు పాటించాలి. వ్యాధి సోకిన గేదె, ఆవు నుంచి తీసిన పాలను 100 డిగ్రీ సెల్సియస్‌ వరకు వేడి చేసిన తర్వాత వినియోగించాలి. వ్యాధిసోకిన పశువులు మృతి చెందితే గోతిలో వేసి బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లి పాతిపెట్టాలి.

టీకాలను సద్వినియోగం చేసుకోవాలి

పశువుల్లో సోకే గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాధి సోకకుండా ముందస్తుగా వ్యాక్సిన్‌ వేయిస్తే పశుసంరక్షణ బాగుంటుంది. వ్యాధి బారిన పడిన పశువులను గుర్తించి ఆస్పత్రిలో చికిత్స అందించాలి. గ్రామాల వారీగా వ్యాక్సినేషన్‌ చేపడుతున్నాం. ముందుగా రైతులకు సమాచారం అందిస్తున్నాం.

– కొమురయ్య, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి

25

23

13

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement