
డ్రగ్స్కు బానిసలుగా మారొద్దు
వాజేడు: ప్రాణాలను బలి తీసుకునే డ్రగ్స్కు బానిసలుగా మారొద్దని పేరూరు ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్ అన్నారు. మండల పరిధిలోని చిన్న గొళ్లగూడెం గ్రామంలో పోలీసులు శనివారం డ్రగ్స్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి లాంటివి సేకరించినా, అక్రమంగా విక్రయించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్తో పట్టు బడిన వారిని కఠినంగా శిక్షిస్తామని ఎస్సై తెలిపారు.
కర్రిగుట్టల్లో కొనసాగుతున్న కూంబింగ్
వెంకటాపురం(కె): తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లో సాయుధ బలగాలు 12 రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. గుట్టల్లో మావోయిస్ట్ అగ్రనేతలతో పాటు సుమారు వెయ్యిమంది మావోయిస్టులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో కర్రిగుట్టలను కేంద్ర బలగాలు చుట్టు ముట్టాయి. ఆ గుట్టల చుట్టూ మావోయిస్టులు అమర్చిన మందు పాతరలను తొలగించుకుంటూ బలగాలు ముందుకు సాగుతున్నాయి. కాగా 12వ రోజు శనివారం కూంబింగ్ ఆపరేషన్లో పాల్గొన్న ఇద్దరు జావాన్లు వడదెబ్బకు గురికావటంతో వారిని వెంకటాపురం వైద్యశాలకు తరలించి చికిత్స నిర్వహించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా వైద్యశాలకు తరలించినట్లు సమాచారం.
మలేరియా జ్వర నిర్ధారణ పరీక్షలు
వాజేడు: మలేరియా జ్వరాల నిర్ధారణ పరీక్షలను పేరూరు వైద్య సిబ్బంది కడేకల్ గ్రామంలో శనివారం నిర్వహించారు. పేరూరు వైద్యాధికారి రాహిల్ ఆధ్వర్యంలో జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణలో భాగంగా ఈ పరీక్షలను చేశారు. ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న వలస కూలీల మూలంగా మలేరియా జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అందులో భాగంగా మలేరియా లేని మండలంగా మార్చడం కోసం ముందస్తుగా పరీక్షలను నిర్వహించి మందులను ఇస్తున్నట్లు వైద్యాధికారి రాహిల్ తెలిపారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ వేణుగోపాలకృష్ణ, తిరుపతి, శ్రీదేవి, శారద, ఆశ కార్యకర్త తదితరులు పాల్గొన్నారు.
ట్యాంకర్లతో నీటి సరఫరా
వెంకటాపురం(కె): చెలిమ నీరే తాగునీరు శీర్షికన సాక్షిలో శనివారం కథనం ప్రచురితమైంది. దీనిపై అధికారులు స్పందించారు. ఈ మేరకు మండల పరిధిలోని చిరుతపల్లి గ్రామాన్ని అధికారులు సందర్శించారు. పర్శికగూడెం గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందకు పంచాయతీ ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ వెంకటసతీష్, గ్రిడ్ ఏఈ రవితేజ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావొద్దు
ములుగు: నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటూ ఇసుక ర్యాంపుల యజమానులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకూడదని మంత్రి సీతక్క తనయుడు, రాష్ట్రయూత్ కాంగ్రెస్ కార్యదర్శి సూర్య శనివారం ఒక ప్రకటనలో సూచించారు. జాతీయ రహదారిపై ఎక్కడబడితే అక్కడ లారీలను నిలిపి సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని తెలిపారు. అలాంటి ఇసుకక్వారీల యజ మానులపై చర్యలు తీసుకోవడానికి మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ర్యాంపుల రద్దుకు మద్దతిస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఆయా మండలాల నుంచి చాలా ఫిర్యాదులు అందుతున్నాయని వివరించారు. లారీలను రోడ్లపై ఆపడం ద్వారా వాహనదారులకు, ప్రయాణికులకు అసౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ప్రజాశ్రేయస్సే మంత్రి సీతక్క లక్ష్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని వివరించారు.

డ్రగ్స్కు బానిసలుగా మారొద్దు

డ్రగ్స్కు బానిసలుగా మారొద్దు

డ్రగ్స్కు బానిసలుగా మారొద్దు