
21నుంచి ప్రత్యేక వ్యాధి నిరోధక టీకాలు
వెంకటాపూర్(ఎం): ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు చేపట్టబోయే ప్రత్యేక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప కేంద్రాల వారీగా లెఫ్ట్ అవుట్, డ్రాప్ అవుట్, టీకాలు ఇవ్వని పిల్లల జాబితా ప్రకారం అందరికీ వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని సూచించారు. పీహెచ్సీలో మందుల నిల్వల, ఓపీ రిజిస్టర్, వడదెబ్బ నివారణకు ఏర్పాట్లు చేసిన జింక్, ఓఆర్ఎస్ కార్నర్లను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్య సేవలకు వచ్చే రోగులకు జింక్, ఓఆర్ఎస్ వాడకంపై, వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. గర్భిణులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవం పొందేలా అవగాహన కల్పించాలన్నారు. పుట్టిన పిల్లలకు తల్లిపాలు పట్టించడం వల్ల కలిగే లాభాలను వివరించాలని సూచించారు. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తూ ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను 100శాతం సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి శ్రీకాంత్, జిల్లా శిశు ఆరోగ్యం, వ్యాధి నిరోధక టీకాల నియంత్రణ అధికారి రణధీర్, డాక్టర్ గౌతమ్, డెమో సంపత్, మిడ్లెవెల్ హెల్త్ ప్రొవైడర్ డాక్టర్ సంఘ మిత్ర, ఫార్మసిస్ట్ రాజమణి, స్టాఫ్ నర్స్ మణెమ్మ, ఆయూష్ ఫార్మసిస్ట్ సంధ్య తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్ఓ గోపాల్రావు