సైన్స్ ఎగ్జిబిట్స్ను పరిశీలిస్తున్న న్యాయ నిర్ణేతలు
ఏటూరునాగారం: విద్యార్థులు, యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసే వేదికగా నెహ్రూ యువకేంద్రం మై భారత్ కృషి చేస్తుందని తెలంగాణ గిరిజన గురుకులాల ములుగు రీజినల్ కో ఆర్డినేటర్ ఠాగూర్ హరిసింగ్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నెహ్రూ యువకేంద్రం మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ ఆధ్వర్యంలో మంగళవారం యువ ఉత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు విద్యా సంబంధమైన అంశాలతో పాటుగా ఇతర అంశాల్లోనూ నైపుణ్యాలు కలిగి ఉండాలని సూచించారు. యువతీ యువకులు ఇలాంటి అవకాశాలు ఉపయోగించుకోవా లని సూచించారు. యువత చదువుతో పాటుగా పోటీ పరీక్షలు, వ్యక్తిత్వ వికాసం అంశాలపైనా దృష్టి సారించాలన్నారు. డీసీఓ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం యువ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీల్లోని విజేతలకు సర్టిఫికెట్లు ప్రదా నం చేశారు. ఈ సందర్భంగా చేసిన నృత్యాలు, సైన్స్ ఎగ్జిబిట్లు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎఫ్పీఓ శ్రీధర్, సీడీపీఓ ప్రేమల త, కళాశాల ప్రిన్సిపాల్ రేణుక, జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ పాల్గొన్నారు.
ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు
ఐసీడీఎస్, ఐసీపీఎస్, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఐసీడీఎస్ ద్వారా చిన్నారులకు, కిశోర బాలికలకు అందుతున్న సేవలను వివరించారు. ఐసీపీఎస్ ద్వారా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నిర్మూలనతో పాటు తదితర అంశాలను ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందిస్తున్న చికిత్సలు, సర్వేలతో పాటు తదితర అంశాలను విద్యార్థులకు, యువతీ యువకులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ ప్రేమలత, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, హెల్త్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గిరిజన గురుకులాల రీజినల్
కో ఆర్డినేటర్ ఠాగూర్ హరిసింగ్
యువతలోని నైపుణ్యాలను వెలికితీసేందుకు కృషి