Trolls On Adipurush Team: కుంభకర్ణుడిలా పడుకుంది చాలు, ముందు అప్‌డేట్‌ ఇవ్వు

#WakeUpTeamADIPURUSH: Prabhas Fans Trolls On Adipurush Team For Updates - Sakshi

డార్లింగ్‌ ప్రభాస్‌ పాన్‌ ఇండియా సినిమాలతో మస్తు బిజీగా ఉన్నాడు. ప్రాజెక్ట్‌ కె, సలార్‌, స్పిరిట్‌, ఆదిపురుష్‌.. ఇలా అన్నీ పాన్‌ ఇండియా చిత్రాలే చేస్తున్నాడీ హీరో. అయితే ఆదిపురుష్‌ తప్ప మిగతా అన్ని సినిమాలు ఏదో ఒక అప్‌డేట్‌ ఇస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నాయి. కానీ ఆదిపురుష్‌ నుంచి మాత్రం చాలాకాలంగా ఎలాంటి అప్‌డేట్‌ లేదు.  ఔం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీ సనన్, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్ నటించారు.

షూటింగ్‌ పూర్తై నెలలు గడుస్తున్నా చిత్రయూనిట్‌ ఆదిపురుష్‌ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. దీంతో ఓపిక నశించిన ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో వార్‌ ప్రకటించారు. #WakeUpTeamADIPURUSH (ఆదిపురుష్‌ టీమ్‌ కళ్లు తెరవండి) అన్న హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. 'నీ బాంచన్‌ అయిత, జర ఆదిపురుష్‌ అప్‌డేట్‌ ఇవ్వరాదన్నా..', 'ఓం రౌత్‌ భయ్యా నిద్రపోయింది చాలు కానీ ముందు అప్‌డేట్‌ ఇవ్వు' అని సెటైర్లు వేస్తున్నారు. దీంతో పలు మీమ్స్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. మరి దీనిపై ఆదిపురుష్‌ చిత్రయూనిట్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి!

చదవండి 👉🏾 హీరోయిన్‌ ప్రణీత బేబీ బంప్‌ ఫొటోలు వైరల్‌
సౌత్‌, నార్త్‌ ఏంటి? ఉన్నది ఒకటే ఇండస్ట్రీ: బాలీవుడ్‌ స్టార్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top