శ్రీలు, నవీన్ రాజ్, పూజా సుహాసిని
నవీన్ రాజ్ శంకరపు, పూజా సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘తెరచాప’. జోయల్ జార్జ్ దర్శకత్వంలో కైలాష్ దుర్గం నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల అవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో జోయల్ జార్జ్ మాట్లాడుతూ– ‘‘సముద్రం నేపథ్యంలో సాగే మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అని కోరారు.
‘‘కథ నచ్చి ఈ సినిమా చేశాను’’ అన్నారు కైలాష్ దుర్గం. ‘‘మత్స్యకారుల జీవితాలను అర్థం చేసుకొని ఈ సినిమాని రూపొందించాం’’ అని నవీన్ రాజ్ చెప్పారు. ‘‘మండుటెండలో సముద్ర తీరాన ఇసుకలో చెప్పులు లేకుండా నవీన్ రాజ్ చాలా కష్టపడి నటించారు’’ అని రాజీవ్ కనకాల చెప్పారు.


