ఆ వ్యాధి అంత డేంజరా.. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మృతి | Sakshi
Sakshi News home page

Music Director Passes Away: తీవ్ర విషాదం.. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మృతి

Published Sat, Oct 29 2022 7:28 PM

Tamil Music Director Raghuram Passes Away With Jaundice Today - Sakshi

కోలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. తమిళ యువ సంగీత దర్శకుడు రఘురామ్ కన్నుమూశారు. ఇటీవలే కామెర్ల వ్యాధి బారిన పడిన ఆయన చెన్నైలోని ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో యావత్ కోలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. రఘురాం మృతి పట్ల ఆయన స్నేహితులు, సహచరులు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

తమిళంలో 2017లో వచ్చిన ‘ఒరు కిదైయిన్ కరుణై మను’ చిత్రానికి సంగీతమందించారు. 2011లో ‘రివైండ్’, ‘ఆసై’ తో పాటు మూడు తమిళ చిత్రాలకు సంగీతం అందించారు. కామెర్లు బారిన పడిన ఆయన  చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా.. ఆరోగ్యం క్షీణించడంతో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement