Kangana Ranaut: మహిళా జర్నలిస్ట్​పై కంగనా అసహనం.. ఎందుకంటే ?

Kangana Ranaut Lashes Out A Journalist And Said Sit Down - Sakshi

Kangana Ranaut Lashes Out A Journalist And Said Sit Down: బాలీవుడ్​ బ్యూటీ, డేరింగ్​ క్వీన్​ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అభిప్రాయాలు, కామెంట్లతో వైరల్​గా మారుతుంది. ఏ విషయాన్నైనా, ఎవరితోనైనా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడుతుంది. తాజాగా ఈ స్టార్​ హీరోయిన్​ ఓ మహిళా విలేకరిపై అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటిదాకా హీరోయిన్​గా, కాంట్రవర్సీ క్వీన్​గా అలరించిన కంగనా తాజాగా హోస్ట్​గా వ్యవహరించనుందన్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్​ నిర్మించనున్న రియాల్టీ షో 'లాక్​ అప్'​కు వ్యాఖ్యతగా సందడి చేయనుంది కంగనా. 

ఈ షో మరికొన్ని రోజుల్లో ఆల్ట్​ బాలాజీ, ఎంఎక్స్​ ప్లేయర్​ ఓటీటీల వేదికగా ప్రసారం కానుంది. అయితే ఈ షో ఫార్మాట్​ను తెలియజేస్తూ గురువారం (జనవరి 3) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంగనా జర్నలిస్ట్​ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో ఒక లేడీ జర్నలిస్ట్​ 'మేడమ్, ఈ మధ్య కాలంలో మహిళలు ధరించే దుస్తులను బట్టి వారి ప్రవర్తనపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల దీపికా పదుకొణె కూడా సినిమా ప్రమోషన్స్​లో భాగంగా ఇలాంటి కామెంట్స్​తో టార్గెట్​ చేయబడ్డారు. దీనిపై మీ స్పందన ఏంటీ ?' అని అడిగారు.

దీంతో 'చూడండి, ఎవరైతే తమను రక్షించుకోలేరో వారిని రక్షించడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఆమె తనను తాను రక్షించుకోగలదు. ఆమెకు (దీపికా పదుకొణె) ఆ సామర్థ్యం ఉంది. అయితే ఆమె సినిమాను నేను ఇక్కడ ప్రమోట్​ చేయను. కాబట్టి, మీరు కూర్చొండి.' అంటూ అసహనంగా సమాధానం ఇచ్చింది కంగనా రనౌత్​.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top