అప్పట్లో ఓ దెయ్యం ఉండేది

Appatlo o Deyyam undedi poster release - Sakshi

‘ఖైదీ’తో సూపర్‌ హిట్‌ ఇచ్చారు తమిళ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌. ఆ తర్వాత తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌తో ‘మాస్టర్‌’ తెరకెక్కించారు. లాక్‌డౌన్‌ వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు తన తాజా చిత్రం లోకనాయకుడు కమల్‌హాసన్‌తో ఉంటుందని ప్రకటించారు. ఈ చిత్రం  కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేసి ఈ వార్తను ప్రకటించారు లోకేశ్‌. అందులో ‘అప్పట్లో ఓ దెయ్యం ఉండేది’ అని రాసి ఉంది.

కమల్‌హాసన్‌ నిర్మాణ సంస్థ రాజ్‌ కమల్‌ ఇంటర్నేషనల్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 2021 వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రానికి అనిరు«ద్‌ సంగీత దర్శకుడు. కమల్‌హాసన్‌ స్ఫూర్తితోనే ఇండస్ట్రీకి వచ్చానని పలు సందర్భాల్లో చెప్పారు లోకేశ్‌. 2021లో విడుదలయ్యేవాటిలో కమల్‌ హీరోగా తాను తీయబోతున్న సినిమా ఉత్తమ చిత్రంగా ఉంటుందని కూడా అన్నారు లోకేశ్‌ కనగరాజ్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top