రచ్చకెక్కొద్దు.. | - | Sakshi
Sakshi News home page

రచ్చకెక్కొద్దు..

Jul 15 2025 12:28 PM | Updated on Jul 15 2025 12:28 PM

రచ్చకెక్కొద్దు..

రచ్చకెక్కొద్దు..

విభేదాలొస్తే అంతర్గతంగా చర్చించుకోవాలి

అవసరమైతే పీసీసీ దృష్టికి తీసుకురండి

ఉమ్మడి మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ శ్రేణులకు పొన్నం సూచన

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: విబేధాలుంటే రచ్చకెక్కి మాట్లాడొద్దు.. ఏమైనా సమన్వయ సమస్య ఎదురైతే అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలి.. లేనిపక్షంలో టీపీసీసీ నాయకత్వం దృష్టికి తీసుకురావాలి.. అంతేకానీ ఇష్టానుసారంగా మాట్లాడొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్‌ నేతలకు సూచించారు. సోమవారం గాంధీభవన్‌లో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల కీలక నాయకులతో సమావేశం జరిగింది. సంస్థాగత నిర్మాణం గ్రామ, మండల, జిల్లా కార్యవర్గం, అనుబంధ సంఘాల నియామకం తదితర అంశాలపై పొన్నం నేతలతో చర్చించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే నామినెటేడ్‌, పార్టీ పదవుల ఎంపికలో ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ఒక్కో నియోజకవర్గానికి రెండు చొప్పున రాష్ట్ర కార్పొరేషన్‌ డైరెక్టర్ల పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా అన్ని నామినేటెడ్‌ పదవులతో పాటు, పార్టీ సంస్థాగత పదవుల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఆయా పదవుల కోసం ఇచ్చిన జాబితాలపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసి టీపీసీసీ, ఏఐసీసీ నాయకత్వానికి పంపుతామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్‌షెట్కార్‌, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, నీలం మధు, మెదక్‌ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌, ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిలు రాజిరెడ్డి, నర్సారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement