6,039 కేసుల పరిష్కారం
● రూ. 55,90,281 రికవరీ ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ ● లోక్ అదాలత్కు విశేష స్పందన
మెదక్ కలెక్టరేట్: కోర్టు కేసుల్లో రాజీయే రాజ మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ అన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు, నర్సాపూర్, అల్లాదుర్గు కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా అన్నిరకాల కేసులు 6,039 పరిష్కరించినట్లు తెలిపారు. మొత్తం కేసుల్లో రూ. 55,90,281 రికవరీ చేసినట్లు వివరించారు. రాజీ పడడంతో ఇరువురికి న్యాయం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ఎం శుభవల్లి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సిరిసౌజన్య, స్పెషల్ మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ సాయి ప్రభాకర్, న్యాయవాదులు, అన్నికోర్టుల సిబ్బంది, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.


