
రైతులను మోసం చేస్తే చర్యలు
మెదక్ మున్సిపాలిటీ: నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంబంధిత అధికారులు సమన్వయంగా పని చేసి రైతులకు నకిలీ విత్తనాలు సరఫరా జరగకుండా చూడాలన్నారు. ఆరుగాలం కష్టపడే రైతు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత విత్తన సంస్థలు, డీలర్లు, వ్యాపారులపై ఉందన్నారు. రైతులకు నష్టం కలిగేలా నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరంగా కేసులు నమోదు చేస్తా మని హెచ్చరించారు. ముందస్తుగా రైతులతో సమావేశాలు నిర్వహించి చైతన్య పర్చాలన్నారు. గతంలో నకిలీ విత్తనాల కేసుల్లో స ంబంధం ఉన్నవారిపై నిఘా ఉంచాలని ఆదేశించా రు. రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండి నాణ్యమైన కంపెనీ విత్తనాలు ఎంచుకోవాలన్నారు. లేబుళ్లు, ప్యాకింగ్ లేని విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్ల నుంచి విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. నకిలీ విత్తనాల గురించి, అనుమానిత బ్రోకర్లు, డీలర్ల గురించి పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఎస్పీ ఉదయ్ కుమార్రెడ్డి