బోధనలో మెలకువలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

బోధనలో మెలకువలు తప్పనిసరి

May 21 2025 8:39 AM | Updated on May 21 2025 8:39 AM

బోధనలో మెలకువలు తప్పనిసరి

బోధనలో మెలకువలు తప్పనిసరి

మెదక్‌ కలెక్టరేట్‌: ఉపాధ్యాయులు శిక్షణ సమయంలో బోధనలో మెలకువలు నేర్చుకోవాలని డీఈఓ రాధాకిషన్‌ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఎఫ్‌ఎల్‌ఎన్‌ కెపాసిటీ బిల్డింగ్‌ ప్రోగ్రాం ఫర్‌ ప్రైమరీ టీచర్స్‌కు 5 రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మెదక్‌ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఎడ్యుకేషనల్‌ సెక్రటరీ అధికారి జూమ్‌ మీటింగ్‌లో పలు సూచనలు చేశారు. జిల్లా విద్యాధికారి రాధా కిషన్‌ శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి, ఎంఈఓ శంకర్‌, ఆర్పీలు, మండలంలోని ఎల్‌ఎఫ్‌ఎల హెచ్‌ఎంలు, ఎస్‌జీటీలు, ఉపాధ్యాయులు, సీఆర్‌పీలు పాల్గొన్నారు.

డీఈఓ రాధాకిషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement