నీట్‌ పరీక్షకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

నీట్‌ పరీక్షకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ

May 3 2025 8:45 AM | Updated on May 3 2025 8:45 AM

నీట్‌

నీట్‌ పరీక్షకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ

మెదక్‌మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం జరిగే నేషనల్‌ ఎలిజిబిలిటి కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌)కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 4న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. పరీక్ష కేంద్రం వద్ద బీఎన్‌ఎస్‌ఎస్‌ యాక్ట్‌ అమలులో ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రాలకు 500 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి ఉండరాదని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ట్రాఫిక్‌ పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

వనదుర్గమ్మ సేవలో ఆర్డీఓ

పాపన్నపేట(మెదక్‌): మెదక్‌ ఆర్డీఓ రమాదేవి శుక్రవారం ఏడుపాయల వన దుర్గమ్మను ద ర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సిబ్బంది ఆమెకు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.

హక్కులు, రిజర్వేషన్లను

కాలరాసిన కాంగ్రెస్‌

నర్సాపూర్‌: దేశాన్ని 63 ఏళ్ల పాటు పరిపాలించిన కాంగ్రెస్‌ బీసీల హక్కులు, రిజర్వేషన్లను కాలరాసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్‌గౌడ్‌ విమర్శించారు. శుక్రవారం పలువురు నాయకులతో కలిసి స్థానిక బస్టాండు వద్ద ప్రధాని నరేంద్రమోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో కులగణన, జనగణన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. కులగణనతో బీసీలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రమేష్‌గౌడ్‌, నారాయణరెడ్డి, రాంరెడ్డి, రాజు, రాములు నాయక్‌, నగేష్‌ గౌడ్‌, దిగంబర్‌, తదితరులు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో

సత్తా చాటాలి

మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి

పాపన్నపేట(మెదక్‌): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నాయకులు సత్తా చాటాలని మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభతో కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిందన్నారు. కేసీఆర్‌ ప్రసంగం పార్టీకి పూర్వ వైభవం చాటేలా ఉందన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు నాయకత్వంలో జిల్లాలో బీఆర్‌ఎస్‌ విజయఢంకా మోగించాలన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. వారికి స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలని ప్రజలను కోరారు.

పశువులకు

టీకాలు తప్పనిసరి

మనోహరాబాద్‌(తూప్రాన్‌): పాడి పశువులు రోగాల బారిన పడకుండా రాకుండా చూ డాలని జిల్లా పశు సంవర్థక పర్యవేక్షణ అధికారి శిరిష రైతులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని వాసు గోశాలలో పశువులకు టీకాలు వేశారు. కార్యక్రమంలో ఉమ్మడి తూప్రాన్‌ మండల పశు వైద్యులు లక్ష్మి, వైద్య సిబ్బంది రవి, రాజిరెడ్డి, కృష్ణకుమార్‌, గోపాల మిత్రలు రామస్వామి, శేఖర్‌, సిబ్బంది చిరంజీవి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నీట్‌ పరీక్షకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ
1
1/2

నీట్‌ పరీక్షకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ

నీట్‌ పరీక్షకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ
2
2/2

నీట్‌ పరీక్షకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement