చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడొద్దు | - | Sakshi
Sakshi News home page

చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడొద్దు

May 30 2025 7:01 AM | Updated on May 30 2025 7:01 AM

చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడొద్దు

చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడొద్దు

మెదక్‌ మున్సిపాలిటీ: ప్రజలంతా శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలని మెదక్‌ డీఎస్పీ ప్రసన్నకుమార్‌ అన్నారు. బక్రీద్‌ సందర్భంగా గురువారం పట్టణంలోని ఓ గార్డెన్‌లో పీస్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. హిందూ, ముస్లింలు ఎలాంటి ఘర్షణలకు వెళ్లకుండా శాంతియుతంగా పండుగలను జరుపుకోవాలన్నారు. గతేడాది జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. హిందువులు గోవులను దేవతగా పూజిస్తారు కాబట్టి, వారికి ప్రత్యేక శ్రద్ధ ఉంటుందన్నారు. ముస్లింలు ఏదైనా చట్టపరంగా, నియమ నిబంధనలకు అనుగుణంగా చేస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు. చట్టానికి వ్యతిరేకంగా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ నాగరాజు, ఎస్సై అమర్‌, మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయలక్ష్మి, వెటర్నరీ డాక్టర్‌ లక్ష్మణ్‌, పోలీసు సిబ్బంది, హిందూ, ముస్లింలు పాల్గొన్నారు.

మెదక్‌ డీఎస్పీ ప్రసన్నకుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement