
చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడొద్దు
మెదక్ మున్సిపాలిటీ: ప్రజలంతా శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ అన్నారు. బక్రీద్ సందర్భంగా గురువారం పట్టణంలోని ఓ గార్డెన్లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. హిందూ, ముస్లింలు ఎలాంటి ఘర్షణలకు వెళ్లకుండా శాంతియుతంగా పండుగలను జరుపుకోవాలన్నారు. గతేడాది జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. హిందువులు గోవులను దేవతగా పూజిస్తారు కాబట్టి, వారికి ప్రత్యేక శ్రద్ధ ఉంటుందన్నారు. ముస్లింలు ఏదైనా చట్టపరంగా, నియమ నిబంధనలకు అనుగుణంగా చేస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు. చట్టానికి వ్యతిరేకంగా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ నాగరాజు, ఎస్సై అమర్, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, వెటర్నరీ డాక్టర్ లక్ష్మణ్, పోలీసు సిబ్బంది, హిందూ, ముస్లింలు పాల్గొన్నారు.
మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్