
జడ్జిగా బాధ్యతల స్వీకరణ
నర్సాపూర్/పాపన్నపేట(మెదక్): నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జిగా హేమలత గురువారం బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ నుంచి ఆమె బదిలీపై ఇక్కడకు వచ్చారు. బార్ అసోసియేషన్ ప్రతినిధులు, కోర్టు సిబ్బంది స్వాగతం పలికి సన్మానించారు. ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. కోర్టులో సివిల్, క్రిమినల్ కేసులు పరిష్కరించేందుకు న్యాయవాదులు, సిబ్బంది సంపూర్ణంగా సహకరించాలన్నారు. అంతకుముందు ఏడుపాయల వన దుర్గమ్మను దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
రాహుల్ చిత్రపటానికి
క్షీరాభిషేకం
నర్సాపూర్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చిత్రపటానికి గురువారం కాంగ్రెస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. రాహుల్గాంధీ భారత్ జోడోయాత్రలో ప్రజల కష్టాలు గుర్తించారని తెలిపారు. కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందని గుర్తించారని చెప్పారు. అందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో తమ పార్టీ మేనిఫెస్టోలో కులగణన చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా రాహుల్గాంధీ డిమాండ్ చేయడంతోనే కేంద్రం ప్రభుత్వం కులగణనకు అంగీకరించిందని వివరించారు. సమావేశంలో ప్యాక్స్ చైర్మన్ రాజుయాదవ్, నాయకులు మల్లేష్, రిజ్వాన్, చిన్న ఆంజిగౌడ్, సురేష్, రషీద్, నగేష్, ఉదయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
6 నుంచి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు
శివ్వంపేట(నర్సాపూర్): ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధి చెందిన దొంతి వేణుగోపాలస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా జంట నగరాలు, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. 6న విష్వక్సేన పూజతో ప్రారంభమై 16న పూర్ణాహుతితో బ్రహోత్సవాలు ముగియనున్నాయి.
హక్కుల కోసం
ఉద్యమిద్దాం
మెదక్ కలెక్టరేట్: మేడే స్ఫూర్తితో కార్మికుల చట్టాలు, హక్కులను కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాటం నడపాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. 139 ఏళ్ల క్రితం కార్మికులు సాగించిన సమశీల పోరాటాల ఫలితంగానే ప్రపంచ కార్మిక వర్గానికి కొన్ని హక్కులు దక్కాయన్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చి 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మిక హక్కులను, చట్టాలను కాలరాస్తుందన్నారు. ప్రశ్నించే, యూనియన్ పెట్టుకునే హక్కును హరిస్తుందని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు సంతోష్, షౌకత్, మల్లేశం, పద్మారావు, సుధాకర్, యాదయ్య, దుర్గ, లచ్చాగౌడ్, మున్సిపల్, ఆటో యూనియన్, పరిశ్రమల కార్మికులు పాల్గొన్నారు.

జడ్జిగా బాధ్యతల స్వీకరణ

జడ్జిగా బాధ్యతల స్వీకరణ

జడ్జిగా బాధ్యతల స్వీకరణ