ఆర్జీయూకేటీలో ధ్రువపత్రాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఆర్జీయూకేటీలో ధ్రువపత్రాల పరిశీలన

Jun 27 2025 4:49 AM | Updated on Jun 27 2025 4:49 AM

ఆర్జీయూకేటీలో ధ్రువపత్రాల పరిశీలన

ఆర్జీయూకేటీలో ధ్రువపత్రాల పరిశీలన

బాసర: బాసర ఆర్జీయూకేటీలో ఫిజికల్‌ హ్యాండీక్యాప్‌, సాయుధ బలగాల కోటా అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను గురువారం ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఫిజికల్‌ హ్యాండీక్యాప్‌డ్‌ కోటాలో హెరింగ్‌ ఇంపెయిర్‌, మెంటల్‌ రిటార్డేషన్‌, మల్టీఫుల్‌ డిసార్డర్స్‌, ఆర్థోపెడిక్‌ డిసెబిలిటీస్‌, విజువల్‌ ఇంపెయిర్డ్‌ వంటి విభిన్న దివ్యాంగ విద్యార్థులు హాజరయ్యారు. వీరి ధ్రువీకరణను జిల్లా ప్రభుత్వ వైద్యుల బృందం నిర్వర్తించింది. సాయుధ బలగాల సిబ్బందికి చెందిన పిల్లల పత్రాల పరిశీలనను సంబంధిత సాయుధ శాఖల అధికారుల పర్యవేక్షణలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన విద్యార్థుల ప్రొవిజనల్‌ సెలెక్టెడ్‌ లిస్ట్‌ను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామన్నారు. జూలై 4న ప్రొవిజినల్లీ సెలెక్టెడ్‌ లిస్ట్‌ రిలీజ్‌ చేస్తామన్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌ జూలై 7న ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఓఎస్డీ ప్రొఫెసర్‌ మురళీధర్షన్‌, కన్వీనర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌, కో కన్వీనర్లు డాక్టర్‌ దేవరాజు, డాక్టర్‌ విట్టల్‌, రాకేష్‌రెడ్డి, హరికృష్ణ మంతపురి, బద్రి నారాయణ, మోహన్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement