
బ్యాంకులో తుపాకీ మిస్ఫైర్
● తప్పిన పెను ప్రమాదం ● ఆదిలాబాద్లో ఘటన
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని శివాజీ చౌక్ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో తుపాకీ మిస్ఫైర్ అయ్యింది. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. పెను ప్రమాదం తప్పడంతో బ్యాంకుకు వచ్చిన వారు ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం ఉదయం 10.15 గంటలకు బ్యాంకు నుంచి డబ్బులు బయటకు తీసుకెళ్లే సమయంలో గార్డ్ రాములు తుపాకీలో బుల్లెట్లు లోడ్ చేశాడు. పొరపాటున స్ట్రింగర్పై వేలు పడడంతో ఒక్కసారిగా తూటా బ్యాంక్ పైకప్పుకు తగిలింది. దీంతో అధికారులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందోనని ఆందోళనకు గురయ్యారు. ఆ సమయంలో కొందరు ఖాతాదారులు మాత్రమే బ్యాంకులో ఉన్నారు. వన్టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని సంఘటనపై ఆరా తీశారు.
బుల్లెట్