
ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
దస్తురాబాద్: మండలంలోని గోడిసీర్యాల గ్రామ పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ ఆదిలాబాద్ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. గోడిసీర్యాల గ్రామానికి చెందిన గోసుకుల రాజేశ్ తన గ్రామంలో నూతన వాటర్ ప్లాంట్కు నిర్వహణ అనుమతుల కోసం శివకృష్ణను సంప్రదించాడు. రూ.15 వేలు డిమాండ్ చేయగా.. చర్చల అనంతరం రూ.12 వేలకు ఒప్పందం కుదిరింది. మంగళవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో అనుమతి పత్రాలను శివకృష్ణ రాజేశ్కు ఇచ్చాడు. అనంతరం గ్రామ సమీపంలోని ఓనర్సరీలో రూ.12 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికా రులు రెండ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నగదుతోపాటు శివకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఆదిలాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ మధు తెలిపారు.