
విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి
కాసిపేట: సమాజంలో ప్రతి ఒక్కరికీ చదువు ముఖ్యమని, విద్యతో పూర్తి విజ్ఞానాన్ని సంపాదించుకుని జీవితంలో ఉన్నత స్థానంలో నిలు వవచ్చని జిల్లా వయోజనవిద్య అధికారి, మండల ప్రత్యేకాధికారి పురుషోత్తం నాయక్ పేర్కొన్నారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో వయోజనవిద్యపై పంచాయతీ కార్యదర్శులు, వలంటీర్లతో సమావేశమై మాట్లాడా రు. కాసిపేటను వందశాతం అక్షరాస్యత మండలంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. జిల్లా వ యోజనవిద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాత్రి తరగతుల ద్వారా నిరక్షరాస్యులైన వ యోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతున్న ట్లు పేర్కొన్నారు. ఈనెల 28న ఇప్పటివరకు చ దువు నేర్చుకున్న వయోజనులకు ముత్యంపల్లి, ధర్మరావుపేట రైతువేదికల్లో పరీక్షలు, మూ ల్యాంకనం నిర్వహించనున్నట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు ఇందుకు ఏర్పాట్లు చేసుకోవాలని, మండల స్థాయి అధికారులంతా కా ర్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు. తహసీల్దార్ భోజన్న, ఎంపీవో షేక్ సబ్ధ ర్ అలీ, రిసోర్స్ పర్సన్లు బండ శాంకరి, కొండు జనార్దన్, సీనియర్ సహాయకుడు లక్ష్మీనారా యణ, ఏపీఎం వెంకటేశం పాల్గొన్నారు.