స్టాప్‌–డయేరియా పకడ్బందీగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

స్టాప్‌–డయేరియా పకడ్బందీగా చేపట్టాలి

Jun 25 2025 7:02 AM | Updated on Jun 25 2025 7:02 AM

స్టాప్‌–డయేరియా పకడ్బందీగా చేపట్టాలి

స్టాప్‌–డయేరియా పకడ్బందీగా చేపట్టాలి

మంచిర్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో స్టాప్‌–డయేరియా కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్ట ర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. మంగళవారం కలెక్ట ర్‌ చాంబర్‌లో వైద్యారోగ్య శాఖ అధికారి హరీశ్‌రా జ్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్‌తో కలిసి స్టాప్‌–డయేరియా ప్రచార పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం జూలై 31 వరకు నిర్వహించనున్న స్టాప్‌–డయేరియా కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. అతిసార నివారణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆహారం తీసుకునే స మయంలో తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పిల్లలు తల్లిపాలు తాగకపోవడం, వాంతులు అధికంగా కా వడం, తరచూ మల విసర్జన, అనారోగ్యానికి గురి కావడం, అపరస్మాక స్థితికి చేరడం, జ్వరం ఉండ డం, వేగంగా శ్వాస తీసుకోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తదితర లక్షణాలుంటే వెంటనే స మీప ప్రభుత్వాస్పత్రి, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల కు తీసుకువెళ్లి సరైన సమయంలో వైద్యసేవలు పొందాలని పేర్కొన్నారు. స్టాప్‌–డయేరియా కార్యక్రమంలో భాగంగా ఓఆర్‌ఎస్‌, జింక్‌ కార్నర్లు ఏర్పాటు చేయాలని, ఐదేళ్లలోపు పిల్లల్లో అతిసార ను నిర్మూలించేందుకు విస్తృత స్థాయిలో అవగా హన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వైద్యాధికారులు కృపాబాయి, ప్రసాద్‌, సుధాకర్‌నాయక్‌, మాస్‌ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమమే ధ్యేయం

భీమారం: రైతుల సంక్షేమ ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. భీమారం రైతువేదికలో సీఎం రేవంత్‌రెడ్డి రైతునేస్తం కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సమన్వయంతో సమర్థవంతంగా రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలి పారు. రైతునేస్తం ద్వారా రైతులకు సాగులో మెళకువలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి కల్పన, ఏవో సుధాకర్‌, ఏఈవో అరుణ్‌కుమార్‌, రైతులు పాల్గొన్నారు.

భవన నిర్మాణ పనుల పరిశీలన

మండల కేంద్రంలో చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులను కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement