
గంజాయి, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
● సీపీ అంబర్కిషోర్ ఝా ● గురుకుల విద్యార్థులకు అవగాహన
జైపూర్: గంజాయి, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మత్తుపదా ర్థాల నిర్మూలన వారోత్సవాల్లో భాగంగా జైపూర్ గురుకులంలో విద్యార్థులకు మంగళవారం అవగా హన కార్యక్రమం నిర్వహించారు. సీపీ ముఖ్యఅతి థిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మత్తు ప దార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. వి ద్యార్థుల దృష్టి భవిష్యత్, జీవిత లక్ష్యంపై మాత్రమే ఉండాలని తెలిపారు. నిషేధిత గంజాయి, డ్రగ్స్, ఇ తర మత్తు పదార్థాలకు ఆకర్షితులు కావద్దని పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ వినియోగంతో కలిగే అనర్ధాల గురించి వివరించారు. మాదకద్రవ్యాల నిర్మూలన, గంజాయి రహిత ప్రాంతమే లక్ష్యంగా పోలీస్ శాఖ కృషి చేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా నిరంతరం విద్యాసంస్థలు, గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నట్లు తెలిపారు. చెడు స్నేహితులతోనే చెడు అలవాట్లకు గురవుతారని, తల్లిదండ్రుల ఆశలు వమ్ము చేయకుండా లక్ష్య సాధనకు కృషి చేయాలని తెలిపారు. ఉపాధ్యాయులు, వసతి గృహం ప్రి న్సిపాల్ విద్యార్థుల ప్రవర్తన గమనిస్తూ ఉండాలని, ఎక్కడైనా గంజాయి సేవించినా, విక్రయించినా స మాచారం ఇవ్వాలని సూచించారు. విద్యార్థులతో మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. గురుకులం, కేజీబీవీలో అధిక మార్కులు సాధించి న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీలు వెంకటేశ్వర్, మ ల్లారెడ్డి, శ్రీనివాస్, శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్, రాజ్కుమార్, ఎస్సైలు శ్రీధర్, శ్వేత, సంతోష్, గు రుకులాల ప్రిన్సిపాల్లు నాగేశ్వర్రావు, రమేశ్బా బు, కేజీబీవీ ఎస్వో ఫణిబాల పాల్గొన్నారు.