
● వైకల్య సర్టిఫికెట్ల జారీలో జాప్యం ● రిజిస్ట్రేషన్ చే
సాక్షిప్రతినిధి, మంచిర్యాల: దివ్యాంగులకు ‘సదరం’ గుర్తింపు పత్రం జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం తప్పనిసరైన దివ్యాంగ సర్టిఫికెట్ల కోసం జిల్లాలో వందలాది మంది వేచి చూస్తున్నారు. గతంలో మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకుని సదరం క్యాంపులకు హాజరయ్యేవారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యూడీఐడీ (విశిష్ట దివ్యాంగ గుర్తింపు) కార్డులు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యూడీఐడీ పొందేందుకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్నవారు తమ ఫోన్ నంబర్లకు సమాచారం వస్తేనే జిల్లా ఆస్పత్రికి పరీక్షల కోసం రావాల్సి ఉంటుంది. అయితే పరిమిత సంఖ్యలో స్లాట్స్ ఉండడంతో రెన్యూవల్ కోసం వందలాది మంది ఎదురుచూస్తున్నారు. ప్రతీ సోమవారం అనే క మంది దివ్యాంగులు తమకు పింఛన్ అందడం లేదని, ఇతర సంక్షేమ పథకాలు వర్తించడంలేదని ప్రజావాణిలో కలెక్టర్కు అర్జీలు ఇస్తున్నారు.
తప్పని నిరీక్షణ
మానసిక వైకల్యంతో పాటు శారీర లోపాలతో జిల్లాలో ఎంతోమంది బాధపడుతున్నారు. వీరిలో కళ్లు, కీళ్లు, ఎముకలు, మూగ, వినికిడితో బాధపడుతున్నవారికి స్థాయిని బట్టి నిపుణులైన వైద్యులు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. అయితే జిల్లాలో వే లాదిమంది దివ్యాంగ ధ్రువీకరణ పత్రాల కోసం ఎ దురుచూస్తున్నారు. ఇప్పటికే అనేకమంది యూడీఐ డీ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. కానీ.. స్లాట్ దొరకక నిరీక్షిస్తున్నారు. దీంతో వైద్యనిపుణులు పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంలో జాప్యం జరుగుతోంది. మరోవైపు త క్కువ వైకల్య శాతం ఉండి కూడా, కొందరు స్లాట్ బుకింగ్ చేయడంతో పరీక్షల అనంతరం అనర్హతగా గుర్తిస్తున్నారు. దీంతో అర్హులైన చిన్నారుల నుంచి పెద్దవయస్సు వారితో పాటు నిరుపేదలు పింఛన్ పైనే ఆధారపడి జీవించే అనేకమందికి ఇబ్బందిగా మారింది. జిల్లా ‘సెర్ప్’ అఽధికారులు మాత్రం రిజి స్ట్రేషన్లు చేసుకున్నాక అందరికీ అవకాశం వస్తుంద ని.. వారికి నేరుగా సమాచారం అందుతుందని అప్పటిదాకా వేచి చూడాలని సూచిస్తున్నారు.
జిల్లాలో పెండింగ్ దివ్యాంగ అప్లికేషన్లుమూడు నెలలుగా.. 734
3నుంచి 6నెలలుగా.. 340
ఆరునెలల పైబడి.. 93
మొత్తం 1,167
దివ్యాంగ సర్టిఫికెట్లు పొందినవారు
17,771

● వైకల్య సర్టిఫికెట్ల జారీలో జాప్యం ● రిజిస్ట్రేషన్ చే