
కాంగ్రెస్ పాలనలోనే రైతు సంక్షేమం
బెల్లంపల్లిరూరల్: రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే గ డ్డం వినోద్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని కన్నాల రైతువేదికలో ఏర్పాటు చేసిన రైతు భరోసా సంబరాల కార్యక్రమానికి వినోద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులతో క లిసి సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి పాలాభిషే కం చేశారు. రైతులను ఉద్దేశించిన సీఎం ప్రసంగించగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించా రు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు ను రాజుగా చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కా ర్యాచరణ చేపడుతోందని తెలిపారు. రైతులు వ్యవసాయశాఖ అధికారుల సూచనలు, సలహాలు పాటించి సాగులో రాణించాలని సూచించారు. ఆర్డీవో హరికృష్ణ, ఏవో ప్రేమ్కుమార్, నాయకులు రాంచందర్, ప్రతాప్, సత్యనారా యణ, రవి, శ్రీనివాస్, స్వామి ఉన్నారు.