
● జిల్లా కేంద్రానికి వరద బెంగ ● గోదావరితో, రాళ్లవాగుకు
జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏటా వానాకాలంలో జిల్లా కేంద్రం మంచిర్యాలకు వరద ముప్పు పొంచి ఉంటోంది. వర్షాలు అధికంగా కురిసిన ప్రతీసారి నగర పరిధిలో ఉన్న గోదావరి, రాళ్లవాగు తీర ప్రాంతాలు ముంపును ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ వా నాకాలంలో ఇంకా వర్షాలు మొదలు కానప్పటికీ సీ జన్ మొదలై భారీ వర్షాలు కురిస్తే ఇబ్బంది తప్పేలా లేదు. గోదావరి నదికి సమీపంలో ఉన్న మాతాశిశు సంరక్షణ కేంద్రంతోపాటు సమీప కాలనీలు వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి. మూడేళ్ల క్రితం వ చ్చిన వరదలతో అనేక మంది ఇళ్లలోకి నీళ్లు వచ్చా యి. ఆ ఏడాది సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిశాయి. మరోవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టులు గేట్లు ఎ త్తడం, గోదావరి ఎగువన, శ్రీరాంసాగర్, కడెం ప్రా జెక్టుల వరదలతో తీవ్రత పెరిగింది. సుందిళ్ల, అ న్నారం బరాజ్ల్లో నీటి నిల్వలతో నదిలో నిల్వ పెరి గి, రాళ్లవాగుకు బ్యాక్ వాటర్ ముప్పు పెరిగింది. అయితే మళ్లీ ఆ పరిస్థితి రాలేదు. వర్షాలు అధికంగా కురిస్తే మళ్లీ ముప్పు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది.
చినుకుపడితే ఇబ్బందే..
జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో కొద్దిపాటి వర్షానికే ఇబ్బంది ఎదురవుతోంది. ఈ వేసవిలో అకాల వానలు కురిశాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోతున్నా యి. డ్రెయినేజీలు నిండిపోవడంతోపాటు కుంచించుకుపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లా కేంద్రంలో మార్కెట్ ఏరియాలు, ప్రధాన రో డ్ల గుండా, వ్యాపార వాణిజ్య సముదాయాల భవన యజమానులు తమకు తోచినట్లుగా వ్యవహరిస్తున్నారు. రాముని చెరువు కట్ట తూము నుంచి వదిలే వరద కాలువ ఆక్రమణలతో కుంచించుకుపోతోంది. పూడిక తీయలేదు. చెరువు నుంచి వెళ్లే కాలువ, బైపాస్ రోడ్డు రాళ్లవాగులో కలిసే వరకు చాలా చోట్ల చిన్నగా మారింది. ఇక తిలక్ చెరువు నుంచి వచ్చే కాలువ సైతం వరకు ఇళ్లస్థలాలు వెలిశాయి. పోచమ్మ చెరువు కింది భాగం, తోళ్లవాగుకు ఇరువైపులా ఆక్రమణలు ఉన్నాయి. దీంతో వరదలు వస్తే ఆయా కాలనీల్లో నీరు నిలిచిపోతోంది. దీంతో ము రుగు నీటి కాలువలు పొంగిపొర్లుతున్నాయి. మరో వైపు సీసీ రోడ్లు, డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఓ చోట ఎత్తు, ఓ చోట వంపుగా నిర్మిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా నాలా లు, రోడ్డు అడ్డంగా తవ్వివేస్తున్న పైపులైన్ల కోసం వేస్తున్న స్లాబ్లు గతంలో కంటే ఎత్తుగా ఉండి, పాత సీసీ రోడ్లు కిందికి ఉంటున్నాయి. దీంతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోతున్నాయి.
రిటైనింగ్ వాల్ ఆలస్యమే..
రాళ్లవాగులోకి సుమారు 50వేల నుంచి 60వేల క్యూసెక్కుల వరద నీరు గోదావరిలో కలుస్తున్నట్లు అంచనా. ఈ వరదకు తోడు గోదావరి బ్యాక్ వాటర్తో కలసి లోతట్టు ప్రాంతాలకు ముంపు ఏర్పడుతోంది. ముంపు నుంచి తప్పించేందుకు వాగుకు ఇరువైపులా 7.3 కిలోమీటర్ల మేర కాలనీలకు రక్షణ గోడ నిర్మిస్తున్నది తెలిసిందే. ఇటీవల నిర్మాణ పనులు మొదలు పెట్టారు. రూ.255కోట్లతో గోదావరిలో వాగు కలిసే చోటు నుంచి కార్మెల్ స్కూల్ పై వరకు నిర్మించాల్సి ఉంది. ఈ పనులు ప్రారంభం కాగా, వేసవిలోనే అకాల వర్షాల కారణంగా సాగలేదు. తాజాగా వానలు మొదలైతే వాగులో నీటి ఉధృతితో పనులకు ఆటంకం కలుగుతుంది. దీంతో ఈ వానాకాలంలో గోడ అందుబాటులోకి వచ్చేలా లేదు. మళ్లీ వరదలు తగ్గుముఖం పడితే వాగుకు ఇరువైపులా గోడ నిర్మాణానికి వీలు కలుగుతుంది. అయితే ఈసారి అధిక వర్షాలు కురిస్తే ఇబ్బంది పడాల్సి వచ్చే అవకాశం ఉంది.

● జిల్లా కేంద్రానికి వరద బెంగ ● గోదావరితో, రాళ్లవాగుకు