సత్వరమే సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సత్వరమే సమస్యలు పరిష్కరించాలి

Jun 24 2025 4:05 AM | Updated on Jun 24 2025 4:05 AM

సత్వరమే సమస్యలు పరిష్కరించాలి

సత్వరమే సమస్యలు పరిష్కరించాలి

మంచిర్యాలఅగ్రికల్చర్‌: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణతో కలిసి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని అన్నారు. భూ సమస్యలు, పింఛన్‌, భూ పరిహారం, ఇందిరమ్మ ఇళ్లు తదితర సమస్యలపై ప్రజలు దరఖాస్తులు అందజేశారు. రైతు భరోసా రాలేదని, తమకన్న ఎక్కువ భూమి ఉన్న రైతులకు డబ్బులు పడ్డాయని బెల్లంపల్లికి చెందిన ముర్కురి సత్తమ్మ, చెన్నూర్‌ మండలం కన్నెపల్లికి చెందిన అంగం రాజం దరఖాస్తు చేసుకున్నారు.

● కల్యాణిఖని ఓపెన్‌ కాస్టు ఏర్పాటుతో కోళ్లఫాం, బావి నష్టపోయిన తనకు పరిహారం అందించాలని కాసిపేట మండలం దుబ్బగూడెంకు చెందిన ముడిమడుగల లింగయ్య కోరారు.

● రెండేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన తనకు పింఛన్‌ ఇప్పించాలని బెల్లంపల్లి మండలం బట్వాన్‌పల్లికి చెందిన బోర్లకుంట శ్రీనివాస్‌ విన్నవించాడు.

జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement