
క్రీడలతో ఏకాగ్రత, మానసిక ఉల్లాసం
మంచిర్యాలటౌన్: క్రీడలతో విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని, మానసిక ఉ ల్లాసంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీ పక్ అన్నారు. సోమవారం ఒలింపిక్ డే రన్– 2025 కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుంచి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానం వరకు ఒలింపిక్ డే రన్ నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు ప్రతీరోజు కొంత సమయం వ్యాయామం, క్రీడలకు కేటా యించాలని అన్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి హన్మంతరెడ్డి, ఏసీపీ ప్రకాశ్, షెడ్యూల్డ్ కులాల సహకార సంస్థ ఈడీ దుర్గాప్రసాద్, పట్టణ సీఐ ప్రమోద్రావు, క్రీడాసంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.