అనుమానాస్పదంగా విద్యార్థిని మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదంగా విద్యార్థిని మృతి

Jun 24 2025 4:05 AM | Updated on Jun 24 2025 4:05 AM

అనుమానాస్పదంగా విద్యార్థిని మృతి

అనుమానాస్పదంగా విద్యార్థిని మృతి

లక్సెట్టపేట: లక్సెట్టిపేట మున్సిపాల్టీ పరిధిలోని గో దావరి రోడ్‌కు చెందిన బ త్తుల జ్యోత్స్న(15) సోమవారం అనుమానాస్పద స్థి తిలో మృతిచెందింది. ఎస్సై గోపతి సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బత్తుల వెంకటి, అరుణ దంపతుల కూతురు జ్యోత్స్న స్థానికప్రభుత్వ బాలికల ఉ న్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈ నెల 21న అరుణ తన తల్లిగారిల్లు నల్గొండ జిల్లా చి త్తలూరుకు వెళ్లింది. ఉదయం పాఠశాలకు వెళ్లడాని కి సిద్ధమైన జ్యోత్స్న ఇంటి గదిలోని రేకుల షెడ్డులో పైపులకు ఉరేసుకుని కనిపించింది. కుటుంబీకులు గమనించి స్థానిక ప్రభుత్వ సివిల్‌ ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు తెలిపారు. వెంకటి మొదటి భార్య కుమారులపై అనుమానంగా ఉందని తల్లి అరుణ ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement