
ప్రతీ ఒక్కరికి విద్యార్థి దశ కీలకం
మందమర్రిరూరల్: ప్రతీ ఒక్కరికి విద్యార్థి దశ కీలకమని, లక్ష్యాన్ని ఎంచుకుని జీవితంలో స్థిరపడాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. యాంటీ డ్ర గ్స్ అవేర్నెస్ వారోత్సవాల్లో భాగంగా మత్తు పదా ర్థాల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా సోమవా రం మండల కేంద్రంలోని కేజీబీవీ, మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు బెల్లంపల్లి ఏసీ పీ రవికుమార్తో కలిసి హాజరయ్యారు. పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్కుమార్, ఎంపీడీవో రాజేశ్వర్, ఎస్సై రాజశేఖర్, పాఠశాలల సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.