
● బడిబాటలో 3,311మంది విద్యార్థుల ప్రవేశాలు ● ప్రైవేటు ప
ప్రైవేట్ నుంచి ప్రభుత్వ
పాఠశాలలకు..
మండలం విద్యార్థులు
బెల్లంపల్లి 315
భీమిని 32
భీమారం 118
చెన్నూర్ 235
దండేపల్లి 282
హాజీపూర్ 162
జైపూర్ 106
జన్నారం 376
కన్నెపల్లి 126
కాసిపేట 115
కోటపల్లి 106
లక్సెట్టిపేట 386
మంచిర్యాల 414
మందమర్రి 129
నస్పూర్ 151
నెన్నెల 122
తాండూర్ 37
వేమనపల్లి 99
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో నిర్వహించిన బడిబాట కార్యక్రమం సత్ఫలితాలనిచ్చింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరిగింది. బడుల బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విద్యార్థులను సర్కారు బడిబాట పట్టేలా చేసింది. ఉపాధ్యాయుల నియామకం, ఖాళీగా ఉన్న చోట సర్దుబాటు ద్వారా సబ్జెక్టు టీచర్ల కొరతను అధిగమించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ తరగతులు, ఏఐ పాఠాలు తదితర చర్యలు చేపట్టారు. కొత్త ప్రవేశాలు ఎక్కువగా ఒకటో తరగతిలోనే వచ్చాయి. ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. నాణ్యమైన విద్యాబోధన, ఉచితంగా పుస్తకాలు, యూనిఫాంలు, పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రైవేటులో ఫీజులు భారంగా మారి ప్రభుత్వ బడుల్లో చేరుతుండడంతో కళకళలాడుతున్నాయి. ఈ నెల 6నుంచి 19వరకు నిర్వహించిన బడిబాట గురువారం ముగియగా.. 3,311మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. మరింతగా అడ్మిషన్లు పెరిగే అవకాశాలున్నాయి.
ఒకటి నుంచి పది వరకు..
ఈ ఏడాది ఒకటో తరగతిలో ప్రైవేటు, అంగన్వాడీ కేంద్రాలు, నేరుగా ప్రవేశాలు పొందిన విద్యార్థులు 2,493మంది ఉన్నారు. రెండు నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన వారు 1,802మంది ఉన్నారు. 2నుంచి 10వరకు 1,509మంది ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడుల్లో చేరడం గమనార్హం. మంచిర్యాల మండలంలోనే 263మంది ప్రవేశాలు పొంది ముందు వరుసలో నిలువగా, లక్సెట్టిపేట మండలంలో 198 మంది విద్యార్థులతో తర్వాత స్థానంలో నిలిచారు.
ప్రైవేట్ నుంచి..
నర్సరీలోనే ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల మోత మోగుతోంది. వేలాది రూపాయలు ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంలు ఇలా రకరకాల కొనుగోళ్ల భారం పడుతోంది. సర్కా రు పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం కొనసాగుండడం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూ నిఫాం, మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్య అంది స్తుండడం వల్ల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. 2023–24 విద్యాసంవత్సరంలో 3,688 మంది, 20 24–25లో 3,572 మంది విద్యార్థులు చేరారు.
తల్లిదండ్రులకు నమ్మకం పెరిగింది..
ప్రభుత్వ బడిలో వసతులతో కూడిన విద్య అందిస్తుండడంతో తల్లిదండ్రులకు నమ్మకం పెరిగింది. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేయడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సర్కారు బ డుల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు, మౌలిక స దుపాయాలు కల్పిస్తుండడంతోపాటు పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం కూడా అందిస్తుండడం వల్ల చేరుతున్నారు.
– ఎస్.యాదయ్య, డీఈవో

● బడిబాటలో 3,311మంది విద్యార్థుల ప్రవేశాలు ● ప్రైవేటు ప