రండి.. దయచేయండి.. | - | Sakshi
Sakshi News home page

రండి.. దయచేయండి..

Jun 12 2025 3:39 AM | Updated on Jun 12 2025 3:39 AM

రండి.

రండి.. దయచేయండి..

వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలలు గురువారం పునఃప్రారంభం కానున్నాయి. 48రోజులపాటు ఆటపాటలతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడిపిన విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తొలిరోజునే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లు అందించనున్నారు. ఈ ఏడాది నుంచి 50శాతం అంతకంటే ఎక్కువ మంది ఉన్న పాఠశాలల్లో కృత్రిమ మేధ ఆధారిత అభ్యసన కార్యక్రమం అమలు చేయనున్నారు. 2025–26విద్యాసంవత్సరం పాఠశాలల ప్రారంభం పండుగలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

పదో తరగతి వరకు ఇక్కడే..

లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్నాను. అప్పటి రోజుల్లో తాలూకా హెడ్‌ కావడంతో ఇక్కడే ప్రభుత్వ పాఠశాల ఉన్నది. 1973–74లో పదవ తరగతి చదివాను. సుదూర ప్రాంతాల నుంచి చాలామంది విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేశారు. మంచి హోదా, ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నారు. నేను ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందిస్తున్నాను. నేను చుదువుకున్న పాఠశాలను మరిచిపోలేక పోతున్నాను. అప్పటి పాఠశాల శిథిలావస్థకు చేరడంతో కొత్త భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి నిర్మాణం చేపట్టాను. విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని ఈ నెల 12న ప్రారంభిస్తున్నాం. – మంచిర్యాల ఎమ్మెల్యే

కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు

స్టేషన్‌రోడ్‌ పాఠశాల ముస్తాబు

చెన్నూర్‌/చెన్నూర్‌రూరల్‌/జైపూర్‌/జన్నారం: చెన్నూర్‌ మున్సిపాల్టీ పరిధిలోని సర్కారు పాఠశాలలను ఉపాధ్యాయులు రంగు రంగుల పూలు, బెలూన్లతో ఆకర్షణంగా తీర్చిదిద్దారు. తాగునీరు, బెంచీలు, కుర్చీలు, మూత్రశాలలు వంటి సౌకర్యాలు కల్పించారు. విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ప్రధానోపాధ్యాయురాలు స్వప్నశ్రీ తెలిపారు. మండలంలోని సుద్దాల గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 57మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల ఫొటోలతో ఎంట్రెన్స్‌బోర్డు ఏర్పాటు చేశారు. తరగతి గదుల్లో ఆటవస్తువులతోపాటు చిత్రాలు వేయించారు.

● జైపూర్‌ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్భాగాంధీ విద్యాలయాల్లో గదులు, పరిసరాలు శుభ్రం చేయించారు. స్వాగత తోరణాలు, రంగురంగుల ముగ్గులతో అలంకరించారు. జైపూర్‌ హైస్కూల్లో అత్యాధునిక వసతులు, ల్యాబ్‌, వసతిగృహ సౌకర్యం ఉండడంతో ఈ ఏడాది సుమారు 100మంది కొత్త విద్యార్థులు చేరనున్నారని ఉపాధ్యాయులు తెలిపారు.

● జన్నారం మండలం ధర్మారం ప్రాథమికోన్నత పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహం ప్రతిష్టించారు. ఈ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పాఠశాలకు నూతన భవనం, మరుగుదొడ్లు, మూత్రశాలలు, నిర్మించి అన్ని వసతులు కల్పించారు.

రండి.. దయచేయండి..
1
1/4

రండి.. దయచేయండి..

రండి.. దయచేయండి..
2
2/4

రండి.. దయచేయండి..

రండి.. దయచేయండి..
3
3/4

రండి.. దయచేయండి..

రండి.. దయచేయండి..
4
4/4

రండి.. దయచేయండి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement