
తోరణాలు..
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఓ వైపు పరిశుభ్రత కార్యక్రమాలు.. విద్యార్థులకు స్వాగతం పలికేలా ఆవరణల్లో రంగవల్లులు, మామిడి తోరణాలు, అరటి చెట్లు ఏర్పాటు చేశారు. వాటర్ ట్యాంకులు, మూత్రశాలలు, గదులు శుభ్రం చేయించారు. మండలంలోని ప్రభుత్వ స్కూళ్లలో బడిబాట ద్వారా 250మంది చేరారు.
ఆహ్లాదకర స్వాగతం
నెన్నెల: మండలంలోని కుశ్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సకల సదుపాయాలు, ఉపాధ్యాయుల ప్రత్యేక శ్రద్ధతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పచ్చని చెట్లతో ఆహ్లాదకర స్వాగతం పలుకుతోంది. ఏపుగా పెరిగిన వృక్షాలతో నందనవనాన్ని తలపిస్తోంది. నా లుగు గదులు ఉండగా 60 మంది పిల్ల లు చదువుకుంటున్నారు. విద్యార్థులకు డ్యూయల్ డెస్క్ బెంచీలు, మరుగుదొడ్లు ఉన్నాయి. ఉపాధ్యాయుల ప్రచారంతో ఈయేడు అడ్మిషన్లు పెరిగాయి. బుధవారం పిల్లలు, ఉపాధ్యాయులు, స్థానికులు గ్రామంలో బడిబాట ర్యాలీ నిర్వహించారు.

తోరణాలు..

తోరణాలు..