
సన్నరకం వడ్లకు బోనస్
● కలెక్టర్ కుమార్ దీపక్ ● కొనుగోలు కేంద్రాల సందర్శన
చెన్నూర్రూరల్: సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ కు మార్ దీపక్ అన్నారు. మండలంలోని ఆస్నాద, గంగారం గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ను గురువారం ఆయన చెన్నూర్ తహసీల్దార్ మల్లి కార్జున్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లోని ధా న్యాన్ని వెంటనే కేటాయించిన ప్రకారం రైస్మిల్లుల కు తరలించాలని, టార్ఫాలిన్లు, గోనె సంచులు అవసరం మేరకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసినప్పుడు రైతులకు రశీదు ఇవ్వాలని, రైతుల వివరాలు, ధాన్యం వివరాలను ట్యాబ్లో నమోదు చేయాలని పేర్కొన్నారు.
అమృత్ 2.0 పనులు వేగవంతం చేయండి
చెన్నూర్: ప్రజలకు నిరంతరం తాగునీటి సరఫరాకు నిర్మిస్తున్న అమృత్ 2.0 ట్యాంక్ పనులను వే గవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నా రు. గురువారం ఆయన చెన్నూర్లో అమృత్ 2.0 ట్యాంక్ నిర్మాణ పనులను సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ భగీరథ, అమృత్ ద్వారా ప్రతీ ఇంటికి నీరందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. అధికారులు, కాంట్రాక్టర్ల స మన్వయంతో నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమి షనర్ మురళికృష్ణ, అధికారులు పాల్గొన్నారు.