
‘ఈసెట్’లో బెల్లంపల్లి విద్యార్థుల ప్రతిభ
బెల్లంపల్లి: ఈసెట్–2025 పరీక్ష ఫలితాల్లో బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చారు. నాలుగేళ్ల ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలు ఆదివారం ప్రకటించగా, మైనింగ్ ఇంజినీరింగ్ బ్రాంచ్లో ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. కుర్మ అక్షయ మైనింగ్ బ్రాంచ్లో 1వ ర్యాంకు, ఇంటిగ్రేటెడ్ ర్యాంకు 129 సాధించగా, పిప్పల వర్షిత్ 3వ ర్యాంకు, ఇంటిగ్రేటెడ్ ర్యాంకు 335, వడ్లకొండ మారుతిసాయి 4వ ర్యాంకు, ఇంటిగ్రేటెడ్ ర్యాంకు 365 సాధించాడు.
గత వైభవం నిలబెట్టిన విద్యార్థులు
బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాల గతంలో మెరుగైన విద్యాబోధనతో మంచి గుర్తింపు పొందింది. తర్వాత ఆస్థాయి కొనసాగలేదు. చాలా ఏళ్లకు మైనింగ్ బ్రాంచ్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి కళాశాల ప్రతిష్టను నిలబెట్టారు. కొత్తగూడెం పాలిటెక్నిక్తో పోటీపడుతూ విద్యార్థులు అధ్యాపకుల ప్రోత్సాహంతో అత్యుత్తమ ఫలితా లు సాధించారు. ర్యాంకర్లు అక్షయ (పెద్దపల్లి), వర్షిత్ (హన్మకొండ), మారుతి సాయి (పెద్దపల్లి) నాన్–లోకల్ విద్యార్థులైనా పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకున్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ దేవేందర్, అధ్యాపకులు అభినందించారు.
మైనింగ్ విభాగంలో
రాష్ట్రస్థాయి ర్యాంకులు