
స్పోర్ట్స్ హబ్గా మంచిర్యాల
మంచిర్యాలటౌన్: మంచిర్యాలను స్పోర్ట్స్ హబ్గా అభివృద్ధి చేస్తానని, ఇప్పటికే జిల్లా కేంద్రంలో స్టేడియం నిర్మాణానికి 11 ఎకరాల స్థలం కే టాయించి, రూ.45 కోట్ల నిధులు మంజూరు చే యించానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎఫ్సీఏ ఫంక్షన్హాల్లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి బా క్సింగ్ పోటీలను ఆదివారం తిలకించారు. రా ష్ట్రస్థాయి నుంచి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చి న క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని ఉమ్మడి జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సభ్యులకు సూచించారు. పోటీల్లో ఉత్త మ ప్రదర్శనతో విజేతలుగా నిలువాలని జిల్లా క్రీడాకారులకు సూచించారు. జిల్లా కేంద్రంలో నిర్మించే ఇండోర్ స్టేడియం పనులను ఈ ఏడాదిలోపు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది రాష్ట్రస్థాయి పోటీలు మంచిర్యాలలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. విద్య, వైద్యంతోపాటు, క్రీడలు కూ డా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. మంచి ర్యాలను ఈ మూడురంగాల్లో ముందుండేలా చూస్తాని వెల్లడించారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, వి విధ అసోసియేషన్ల సభ్యులు పాల్గొన్నారు.